Cinema : సినిమా అంటే ఇది మావ.. ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన మూవీ.. ఓటీటీలో తెగ ట్రెండింగ్..
రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ బ్లాక్బస్టర్ మూవీ 'తాయ్ కిళవి' ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై, ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఏప్రిల్ 10 (శుక్రవారం) నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం…