విఫలమైన చర్చలు.. ముదురుతున్న దిగ్బంధనం.. ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి.. ట్రంప్ తదుపరి అడుగు ఎటు?
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, శాంతి స్థాపన కోసం పాకిస్తాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా పంపిన ప్రత్యేక సందేశాన్ని ఇరాన్కు చేరవేసేందుకు పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో టెహ్రాన్కు చేరుకున్నారు. ఉద్రిక్తతలను తగ్గించి, విఫలమైన చర్చలను పునరుద్ధరించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. గత శనివారం (ఏప్రిల్ 11, 2026) ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి…