Headlines

కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!

ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు అని ఓ సామెత ఉంది. ఆ ఉపాయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని నిరూపించాడు చైనాకు చెందిన ఓ యువకుడు. సాధారణంగా మనం చేసే ఒక చిన్న పనిని, ఒక అద్భుతమైన వ్యాపారంగా మలిచి విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియాఖియావో అనే యువకుడు అది చేసి చూపించాడు. ఒంటిపై దురదగా ఉన్నప్పుడు ఎవరైనా గోకితే ఆ…

Read Full News

స్పైడర్‌ మ్యాన్‌లా స్టంట్‌ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..

సోషల్ మీడియాలో రీల్స్, స్టంట్స్‌ మోజులో చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని, ఇంట్లోనే ఓ స్టంట్ చేయడానికి ప్రయత్నించిన చిన్న బాలుడు కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక చిన్న బాలుడు స్పైడర్‌మ్యాన్ అవుట్‌ఫిట్ ధరించి, తనను తాను నిజమైన సూపర్ హీరోలా భావించాడు. ఇంట్లోని ఫర్నిచర్ పైకి ఎక్కి, అక్కడి నుంచి కిందకు దూకుతూ స్టంట్…

Read Full News

వామ్మో.. అంబానీ, అదానీల సరసన రిషభ్ పంత్! తక్కువోడేం కాదు..

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్ ఆడే పోటుగాడు, వికెట్ల వెనుక పాదరసంలా కదిలే ఆటగాడు, ఆఫ్ ది ఫీల్డ్‌లో చెలాకీ కుర్రాడు.. వీటితో పాటు సంపదలో కూడా తోపు అవుతున్నాడు. సంపద అంటే ఏదో సాదా సీదా అనుకునేరు ఏకంగా అంబానీ, అదానీల సరసన నిలుస్తున్నాడు. అంటే వారి అంత సంపాదిస్తున్నాడని కాదు కానీ ఒక్క విషయంలో వారితో సమానంగా ఉన్నాడు. ఆ కథేంటో…

Read Full News

OTT: వీకెండ్ ఎంటర్టైన్మెంట్ అదుర్స్.. ఓటీటీలో సినిమాలు.. బిగ్ బాస్ రియాల్టీ షో..

సెప్టెంబర్ మొదటి వారాంతంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఓటీటీలలో ప్రేక్షకుల కోసం సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ వినోదం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు, బిగ్ బాస్ రియాల్టీ షో 10వ సీజన్ సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతపు ఓటీటీ విడుదలలో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ ‘కొరియన్ కనకరాజు’. వినోదాత్మక కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా (Aha) లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ…

Read Full News

Chicken Prices: చికెన్ ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?

నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా ధరలు పతనమవుతున్నాయి. శ్రావణ మాసం కావడంతో చికెన్‌కు డిమాండ్ తగ్గడమే ధరలు డౌన్ కావడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. శ్రావణ మాసం పూర్తయితే కోళ్లకు మళ్లీ డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ రూ.350 వరకు చేరుకోగా.. శ్రావణ మాసం ప్రారంభమయ్యాక రూ.250కి పడిపోయింది. ఇప్పుడు మరింతగా తగ్గి…

Read Full News

Allu Aravind Vs Yash: అల్లు అరవింద్ Vs యశ్.. మొత్తం వాళ్ళే చేశారా..?

ఫెయిల్యూర్‌ను యాక్సెప్ట్ చేయడానికి చాలా గట్స్ కావాలి. కానీ ప్రజెంట్ జనరేషన్‌లో చాలా మంది ఆ గట్స్‌ లేదు. అందుకే తమ ఫెయిల్యూర్‌ను కప్పిపుచ్చేందుకు రకరకాల దారులు వెతుకుతున్నారు. యష్‌ టాక్సిక్ టీమ్ కూడా అదే చేస్తోంది. సినిమా రిజల్ట్‌పై వస్తున్న నెగెటివిటీని డైవర్ట్ చేసేందుకు కావాలనే ఓ పాత వివాదాన్ని తెరపైకి తెచ్చి అనవసరమైన రచ్చ చేస్తోంది. ఇంతకీ ఏంటా వివాదం..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి. కేజియఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యష్‌ నుంచి…

Read Full News

జనరేషన్ మారింది.. నాటి ఫ్లాపులే.. నేటి విజయాలు

ఒకప్పుడు థియేటర్లలో తుస్సుమన్న సినిమాలు.. ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటే ఇదెక్కడి మాస్ రా మావా అనిపించక మానదు. అప్పట్లో ఆడియన్స్ మూడ్ సెట్ కాక ప్లాపైన చిత్రాలు పదేళ్ల తర్వాత రీ-రిలీజ్ అవుతూ కోట్లలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి ఒకప్పుడు డిజాస్టర్లుగా మిగిలి ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఆ క్రేజీ రీ-రిలీజ్ సినిమాలేంటో ఓసారి చూద్దామా..? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 15 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన పంజా సినిమా రీ-రిలీజ్‌లో…

Read Full News

టాలీవుడ్ లో గ్యాప్ ఇస్తున్న మిడ్ రేంజ్ హీరోలు

టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోలు వదిలేస్తున్న గ్యాప్‌ను అదర్ లాంగ్వేజ్ హీరోలు వచ్చి ఫిల్ చేస్తున్నారా..? మనోళ్లు చూపిస్తున్న అలసత్వమే వాళ్ళకు వరంగా మారుతుందా..? ఒక్కో సినిమా కోసం మన హీరోలు తీసుకునే రెండు మూడేళ్ల సమయమే పొరుగు హీరోల పాలిట అనుకోని వరం అవుతుందా..? అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో.. ఈ పరభాషా హీరోల డామినేషన్ ఏంటి..? ఒకప్పుడు నాని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ ఇలా ఏ మీడియం రేంజ్ హీరోను తీసుకున్నా…

Read Full News

జైలుకు వెళ్లాలనే కోరిక.. ఏకంగా రూ.20 లక్షల బంగారం చోరీ చేసిన యువతి! వీడియో

జైపూర్, సెప్టెంబర్ 6: జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఓ యువతి ఏకంగా భారీ చోరీకి పాల్పడింది. ఉంగరం కొనుగోలు చేసే నెపంతో నగల దుకాణంలోకి వెళ్లి.. దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఉంగరాల బాక్సుతో పరారయ్యేందుకు ప్రయత్నించింది. అయితే దుకాణ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. ఉంగరం కొనే నెపంతో షాపులోకి ఎంట్రీ.. జైపూర్‌లోని జోట్‌వారా ప్రాంతంలోని నివారు రోడ్డులో ఉన్న భవానీ జ్యువెలర్‌…

Read Full News

Andhra News: కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

బస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. అయితే తాజాగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా సడెన్‌గా అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. ఒక్కసారిగా నర్సమ్మపై దాడికి దిగారు. నర్సమ్మ కళ్లలో…

Read Full News