Headlines

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సీఎం, రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించినట్లు సమాచారం.

రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా విమానయాన రంగ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక రంగ విస్తరణకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Cm Chandrababu Team Meets Pm Modi

Cm Chandrababu Team Meets Pm Modi

విజయనగరం జిల్లా బోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విమానాశ్రయం ప్రారంభంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు విస్తరించడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు కూడా మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు 1న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకావడం రాష్ట్రానికి మరింత ప్రాధాన్యతను తీసుకువస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *