rajeshchukka117@gmail.com

ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఘట్కేసర్ వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేసి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఈ రైలులో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఒక ఫోన్‌కాల్ అలర్ట్ అందింది. ఈ సమాచారం నేపథ్యంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో రైలును ఆపి, ప్రతి బోగీని, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టీవీ9 ఛానల్ ఈ తనిఖీలకు సంబంధించిన ప్రత్యేక దృశ్యాలను ప్రసారం చేసింది. సికింద్రాబాద్ చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు ఈ…

Read More
India A World Record: ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన భారత్.. క్రికెట్ హిస్టరీలో తొలిసారి ఇలా..

India A World Record: ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన భారత్.. క్రికెట్ హిస్టరీలో తొలిసారి ఇలా..

India A Win: ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో ఇండియా ఏ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగిన నాల్గవ ఇన్నింగ్స్‌లో ఇండియా ఏ జట్టు 412 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇది ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి. మరే ఇతర దేశానికి చెందిన ఏ జట్టు కూడా 400 పరుగుల కంటే ఎక్కువ…

Read More
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్

శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లోని శంషాబాద్ వద్ద గండిగూడ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది….

Read More
Telangana: సృష్టి ఫెర్టిలిటీ కేసులో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

Telangana: సృష్టి ఫెర్టిలిటీ కేసులో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. మొత్తం 9 ప్రాంతాల్లో చేసిన సోదాలలో, నకిలీ సరోగసీ వ్యాపారం జరుగుతున్నట్లు నిర్ధారించే కీలక పత్రాలు తమ చేతికి చిక్కాయని అధికారులు వెల్లడించారు. ఫేక్ సరోగసీ ద్వారా వచ్చిన డబ్బును పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంలో వినియోగించారని స్పష్టమైన ఆధారాలు దొరికాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నమ్రత అనే మహిళ చేతిలో మోసపోయిన బాధితుల వివరాలను…

Read More
Donald Trump: భారత కంపెనీలపై పగబట్టిన ట్రంప్

Donald Trump: భారత కంపెనీలపై పగబట్టిన ట్రంప్

భారతీయ కంపెనీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇతర రంగాలపై పడిన సుంకాల భారం ఇప్పుడు ఫార్మా రంగంపై పడనుంది. భారత కంపెనీలపై పగబట్టినట్లుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రకటన ప్రకారం, భారత ఫార్మా దిగుమతులపై అక్టోబర్ 1 నుండి 100 శాతం సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు పెద్ద సవాలుగా మారనుంది. అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులు, అలాగే అమెరికాలో…

Read More
సోషల్ మీడియా అనుచిత పోస్టుల పెట్టినవారిపై కఠిన చర్యలు

సోషల్ మీడియా అనుచిత పోస్టుల పెట్టినవారిపై కఠిన చర్యలు

తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలకు నడుం బిగించారు. ఇకపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిపై హిస్టరీ షీట్లు తెరిచి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More
టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం

టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం

టాలీవుడ్‌లో అగ్రతారలుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చిన్నపాటి వివాదం మొదలైంది. ఇది కేవలం మాటల యుద్ధం కాదని, రాజకీయాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలిసినప్పుడు చిరంజీవికి జరిగిన అవమానంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చారన్న కామినేని మాటలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు….

Read More
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు CM రేవంత్ రెడ్డి సూచనలు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు CM రేవంత్ రెడ్డి సూచనలు

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించి, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాస్ వేలను నిశితంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై భారీగా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్…

Read More
14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోలతో నటించింది.. కానీ హిట్స్ మాత్రం లేదు..

14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోలతో నటించింది.. కానీ హిట్స్ మాత్రం లేదు..

చాలా మంది హీరోయిన్ చిన్న వయసులోనే హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చిన వారు ఇప్పుడు సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె అందరూ హీరోలకు ఆమె ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలందరూ ఆమెనే మొదటి ఛాయిస్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో…

Read More
IND vs SL: బుమ్రా, దూబే ఔట్.. భారత జట్టులో రెండు కీలక మార్పులు..

IND vs SL: బుమ్రా, దూబే ఔట్.. భారత జట్టులో రెండు కీలక మార్పులు..

ఆసియా కప్‌ 2025 లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం జనిత్ లియానేజ్‌కు జట్టు అవకాశం ఇవ్వగా, భారత జట్టు రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, శివం దుబేలకు విశ్రాంతి ఇచ్చారు. అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ ఇప్పటికే ఫైనల్‌కు అర్హత…

Read More