Gold: ఇది ట్రైలరే.. 24 గంటల్లో 128 డాలర్లు పెరిగిన బంగారం.. వెండిపై రాబర్ట్ కియోసాకి బ్లాస్టింగ్ కామెంట్స్..
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయ కరెన్సీల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పెట్టుబడిదారులు వెంటనే అప్రమత్తం కావాలని ఆయన హెచ్చరించారు. బంగారం ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 128 డాలర్లు పెరిగిందని చెప్పారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనపడటం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు…