Telangana: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ నెంబర్ నుంచి ఫోన్ వస్తే జాగ్రత్త..
ఈజీ మనీకోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా వరికోత మిషన్ పేరుతో ఓ రైతుకు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.30వేలు కాజేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పులబోయిన భూపాల్కు ఏప్రిల్ 15న 9154178931 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు సుధాకర్…