Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో NH-163 (పాత NH-202) పై రూ. 265 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 2025 మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించినప్పటికీ, కింద ఉండాల్సిన సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం అసంపూర్తిగానే మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు. 2018లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ, కొన్ని శక్తులు అడ్డుతగులుతుండటం వల్ల భూసేకరణ…