రైతులకు రుణ మాఫీ ప్రకటించిన మరో రాష్ట్రం.. రూ. 2 లక్షల వ్యవసాయ రుణంతో పాటు రూ. 50వేలు బోనస్!
మహరాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఆదుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రైతుల కోసం రుణమాఫీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. “పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ షెట్కారి కర్జ్ మాఫీ యోజన”ను ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు, ఈ పథకం ద్వారా రాష్ట్ర రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ పథకం కింద, రూ. 2 లక్షల వరకు…