E20: పెట్రోల్.. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలు! భారీగా తగ్గనున్న వాహనాల మైలేజ్
భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా విక్రయించే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం తప్పనిసరి చేయనుంది. ఈ మిశ్రమ ఇంధనాన్ని E20 పెట్రోల్గా పిలుస్తారు. అదేవిధంగా పెట్రోల్ కనీసంగా RON 95 ప్రమాణం కలిగి ఉండాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పులు వాహనదారుల్లో మైలేజీ, ఇంజిన్ పనితీరుపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. నిపుణుల ప్రకారం 2023–25 తర్వాత తయారైన…