Headlines

Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..

Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..


తెలుగు దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా మొగుడు సినిమాతో ఆయనకు ఎదురైన అనుభవాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటులతో తన పనితీరు, స్పాట్ ఇంప్రూవైజేషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరించారు. కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే సినిమా చిత్రీకరణలో రామ్ చరణ్‌తో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నటులు సంభాషణలను ముందే సిద్ధం చేసుకుని రాకుండా, సహజసిద్ధమైన ప్రతిస్పందనలు, వ్యక్తీకరణలు తనకు ముఖ్యమని ఆయన అన్నారు. మొదట రామ్ చరణ్‌కు తన శైలి అర్థం కావడానికి రెండు, మూడు రోజులు పట్టిందని, ఆ తర్వాత ఆయన పూర్తిగా తనతో సింక్ అయ్యారని తెలిపారు. నటులకు స్పాట్‌లో సన్నివేశాన్ని వివరించి, వారి సహజ నటనను ప్రోత్సహిస్తానని కృష్ణవంశీ పేర్కొన్నారు. ముందే స్క్రిప్ట్ ఇచ్చి బైహార్ట్ చేయమనడం తనకు ఇష్టం ఉండదని, సంభాషణలు సహజంగా ఉండాలని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..

మొగుడు సినిమా తన జీవితంలో ఒక చేదు అధ్యాయమని కృష్ణవంశీ వెల్లడించారు. మొదట ఆ సినిమాను చాలా ఓపెన్‌గా, ఆనందంగా తీయాలని భావించానని, కానీ చివరికి అది ఎప్పుడు అయిపోతుందా అని పూజలు చేసే స్థాయికి వెళ్లిందని అన్నారు. ఆ సినిమా విషయంలో కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు, వారి ఎజెండాలు తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయని, దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడనని ఆయన చెప్పారు. సుమారు ఏడు, ఎనిమిది నెలల పాటు ఆ సినిమా షూటింగ్ తనకు నచ్చలేదని, ఒకరి మోసం వల్ల ఆ సినిమాను ఒప్పుకోవాల్సి వచ్చిందని, అది తనను ఇష్టం లేకుండా చేయించిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్..

నిర్మాణ సంస్థ పరిస్థితులు ఒక సృష్టికర్తపై 100 శాతం ప్రభావం చూపుతాయని కృష్ణవంశీ గట్టిగా చెప్పారు. దీని వల్ల కథాంశం మారడమే కాకుండా, ఎవరితో చేద్దాం అనుకున్నది ఇంకెవరితో చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. మొగుడు తనకు ఒక శాపంలా అనిపించిందని, ఆ చెడు అనుభవం దాదాపు ఎనిమిది నుంచి పది నెలలు కొనసాగిందని కృష్ణవంశీ తన మనసులోని మాటను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *