Headlines

Tollywood : అందంగా లేదని చాలా ట్రోల్ చేశారు.. ఆమె 90’s కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..

Tollywood : అందంగా లేదని చాలా ట్రోల్ చేశారు.. ఆమె 90’s కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..


చాలా మంది బాలీవుడ్ నటీమణులు తమ అందం, నటన కారణంగా సోషల్ మీడియాలోనూ, పరిశ్రమలోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. కానీ 90వ దశకానికి చెందిన ఈ హీరోయిన్ తన రూపం, డ్రెస్సింగ్, హెయిర్స్, ఫ్యాషన్ సెన్స్ కారణంగా ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నటి మరెవరో కాదు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే ‘ప్రేమ్ ఖైదీ’ చిత్రంతో నటనారంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఆమె లుక్స్ చూసి విమర్శలు వచ్చాయి. కానీ వచ్చిన మొదటి అవకాశంతోనే తన ప్రతిభను నిరూపించుకుంది. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ముఖ్యంగా సీనియర్ నటుడు గోవిందాతో ఆమె జోడిని అడియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..

కరిష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. ఆసక్తికరంగా, ఆమె ఐదవ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ, తన నటన ,ఫ్యాషన్ బలంతో చాలా కాలం పాటు బాలీవుడ్‌ను ఏలింది. ‘దిల్ తో పాగల్ హై’ చిత్రంలో తన శక్తివంతమైన పాత్రకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డును కూడా గెలుచుకుంది. మీడియా నివేదికల ప్రకారం, కరిష్మా కపూర్ నేడు సుమారు రూ. 120 కోట్ల నికర ఆస్తిని కలిగి ఉన్నారు . ఆమె ఇప్పటికీ 90వ దశకంలోని అత్యంత ప్రజాదరణ పొందిన, విజయవంతమైన నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్..

1990లలో బాలీవుడ్ చిత్రసీమను ఏలిన ఈ హీరోయిన్.. తన అద్భుతమైన నటన, డ్యాన్స్, గ్లామరస్‌ లుక్స్‌తో అప్పట్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. : ‘రాజా హిందుస్తానీ’ (1996), ‘దిల్ తో పాగల్ హై’ (1997), ‘ఫిజా’ (2000), ‘జుబేదా’ (2001) వంటి చిత్రాలు ఆమె నటనకు మైలురాళ్లుగా నిలిచాయి. కరిష్మా కపూర్ ముందు అభిషేక్ బచ్చన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఆ తర్వాత 2003లో సంజయ్ కపూర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

కరిష్మా కపూర్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *