సౌత్ సినిమా రంగంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కథానాయికలు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తి సురేష్ నుంచి శ్రీలీల వరకు అందరి ఆశలు నార్త్ సినిమా మార్కెట్ పైనే ఉన్నాయి. అయితే అక్కడ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భారీ హైప్ తో ఎంట్రీ ఇచ్చినా, విజయం మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏక్ దిన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆమీర్ తనయుడి సినిమాలో నటించడం, ఆమీర్ ఖాన్ స్వయంగా సాయి పల్లవిని బెస్ట్ హీరోయిన్ అని పొగడటంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ సినిమా విడుదలయ్యాక ఆ స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది. సౌత్ లో పాన్ ఇండియా బ్యూటీగా పేరుపొందిన పూజా హెగ్డేకు కూడా నార్త్ సినిమా అంతగా కలిసి రాలేదు. అక్కడ టాప్ హీరోలతో కలిసి నటించినా విజయం దక్కలేదు.
మరిన్ని వీడియోల కోసం :