ఇది నేను చెబుతున్న మాట కాదు.. భారతదేశపు అత్యున్నత పరిశోధనా సంస్థలు ICMR, TISS కలిసి చేసిన ఒక సంచలన సర్వేలో తేలిన నిజం. ఈ సర్వే ప్రకారం, కేవలం పొగాకు మానేయడం వల్ల భారతదేశంలో 2 కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయట! ఇది ఎలా సాధ్యం? ఒక అలవాటు మారితే ఒక దేశపు ఆర్థిక వ్యవస్థ మారుతుందా? ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాంఈ పరిశోధన ఏదో కొద్దిమందితో చేసింది కాదు. నోయిడాలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్, ముంబైలోని ప్రతిష్టాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కలిసి 2 లక్షల 61 వేల 746 కుటుంబాల డేటాను విశ్లేషించారు. 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వే ఆధారంగా ఈ రిపోర్ట్ సిద్ధం చేశారు. ఈ రిపోర్ట్ ‘BMJ గ్లోబల్ హెల్త్’ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైంది. ఇందులో తేలిన విషయం ఏమిటంటే.. పొగాకు అనేది కేవలం ఆరోగ్య సమస్య కాదు, అదొక ‘పేదరికపు ఉచ్చు’
మరిన్ని వీడియోల కోసం :
సడన్గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
సమ్మర్ హీట్.. లైట్ అంటున్న స్టార్స్