తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 39 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పున బంగాళాఖాతం నుండి, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తేమ గాలులు ప్రవేశించడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలకు, పశ్చిమ తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు, అలాగే తూర్పున ఖమ్మం, భద్రాద్రి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వర్ష సూచన ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
సడన్గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
సమ్మర్ హీట్.. లైట్ అంటున్న స్టార్స్