Headlines

Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌

Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌


Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌

ప్రకృతి విపత్తులను, ముఖ్యంగా భూకంపాలను మానవులు గుర్తించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ, మూగజీవాలు ముఖ్యంగా జంతువులు ప్రకృతిలో జరిగే చిన్నచిన్న మార్పులను కూడా చాలా సులభంగా పసిగట్టగలవు. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. జపాన్‌లో భూకంపం వచ్చి గది తీవ్రంగా ఊగడానికి కొద్ది క్షణాల ముందే, ఒక పిల్లి ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్‌ నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వీడియోలో ఏం జరిగింది?

వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక ఇంట్లోని గదిలో పిల్లి చాలా ప్రశాంతంగా కూర్చుని ఉంది. హఠాత్తుగా ఆ పిల్లి తన చెవులను రిక్కించి, చుట్టూ వింతగా చూడటం ప్రారంభించింది. కొద్ది క్షణాల్లోనే ఏదో ప్రమాదం రాబోతోందని గ్రహించి భయంతో దిక్కుతోచక అటూ ఇటూ పరుగులు తీసింది. ఆ పిల్లి పరిగెత్తిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే గదిలోని పర్నిచర్, వస్తువులు తీవ్రంగా ఊగడం భూకంప ప్రకంపనలు కనిపించింది. గది ఊగడానికంటే ముందే పిల్లి ఈ ప్రమాదాన్ని గ్రహించడం గమనార్హం.

జంతువులు భూకంపాలను ఎలా పసిగట్టగలవు?

శాస్త్రవేత్తల ప్రకారం, భూకంపం సంభవించే సమయంలో రెండు రకాల తరంగాలు ఉద్భవిస్తాయి:

P-తరంగాలు: ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తాయి. కానీ, చాలా సూక్ష్మంగా ఉంటాయి. వీటిని మనుషులు గ్రహించలేరు.

S-తరంగాలు: ఇవి పి-తరంగాల తర్వాత వస్తాయి. ఇవే నేలను, భవనాలను తీవ్రంగా ఊపేస్తాయి.

పిల్లులు, కుక్కలు, ఇతర జంతువుల శ్రవణశక్తి, శరీరంపై ఉండే సూక్ష్మ జ్ఞానేంద్రియాలు పి-తరంగాల వల్ల కలిగే అతి చిన్న కంపనాలను లేదా శబ్దాలను వెంటనే గ్రహించగలవు. అందుకే మనుషులకు ఎస్-తరంగాలు తగిలి భవనాలు ఊగే లోపే జంతువులు అప్రమత్తమవుతాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున తమ స్పందనలు తెలియజేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన:

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన కొద్ది సమయంలోనే లక్షలాది వీక్షణలు సాధించింది. జంతువులకు ఉండే ఈ అద్భుతమైన ఆరవ ఇంద్రియం గురించి నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ఆపదలను పసిగట్టడంలో సాంకేతికత కంటే జంతువుల సహజ సిద్ధమైన జ్ఞానమే వేగవంతమైనదని ఈ సంఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *