Headlines

Train Alarm Chain: కదులుతున్న రైలులో చైన్ లాగితే లోపల ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Train Alarm Chain: కదులుతున్న రైలులో చైన్ లాగితే లోపల ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!


భారతీయ రైల్వే వ్యవస్థ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద రవాణా వ్యవస్థలలో ఒకటి. లక్షలాది మంది ప్రజలు ఈ రైళ్లలో దేశంలోని ఒక చివర నుండి మరొక చివరకు ప్రయాణిస్తుంటారు. ఇలాంటి ప్రయాణాల్లో భద్రతను నిర్ధారించడానికి రైలు లోపల ఒక భద్రతా పరికరాన్ని ఉంచుతారు, అదే అలారం గొలుసు. కదులుతున్న రైలు గొలుసును లాగితే అకస్మాత్తుగా రైలు ఎలా ఆగుతుందనే సందేహం చాలా మందికి వస్తుంది. దీని వెనుక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది. బ్రిటిష్ ఇంజనీర్ జార్జ్ వెస్టింగ్‌హౌస్ మొదట ఈ గొలుసు విధానాన్ని కనుగొన్నారు. అప్పటి నుండి 150 సంవత్సరాలుగా ఇదే పద్ధతి నడుస్తోంది. సాధారణంగా రైలు అలారం చైన్ నేరుగా బ్రేక్ పైపుకు అనుసంధానించబడి ఉంటుంది. ఎవరైనా ఆ చైన్‌ను లాగిన వెంటనే కోచ్ బ్రేక్‌లోని ఎయిర్ పైపు వాల్వ్ తెరుచుకుంటుంది. దీని ఫలితంగా గాలి పీడనం అకస్మాత్తుగా తగ్గిపోతుంది. మీటర్‌పై ఈ పీడనం తగ్గడాన్ని చూసి రైలు నడిపే లోకో పైలట్ వెంటనే ఏదో సమస్య తలెత్తిందని గ్రహిస్తాడు. అప్పుడు అతను వెంటనే మూడుసార్లు హారన్ కొడతాడు. ఈ శబ్దం గార్డులకు భద్రతా సిబ్బందికి ఒక రకమైన హెచ్చరిక సంకేతం ఇస్తుంది. వెంటనే రైలును సురక్షితంగా ఆపివేస్తారు. ఆ తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇతర రైల్వే సిబ్బంది ఏ కోచ్ నుండి చైన్ లాగబడిందో దర్యాప్తు చేయడం ప్రారంభిస్తారు.

ఏ పరిస్థితుల్లో చైన్ లాగవచ్చు
రైలు అలారం చైన్‌ను లాగడం అనేది పూర్తి అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. కాబట్టి ఎవరూ కూడా తమ ఇష్టానుసారం అత్యవసరం కాని సందర్భాలలో రైలు చైన్‌ను లాగకూడదు. ప్రయాణికులు కొన్ని ప్రత్యేకమైన అత్యవసరమైన సందర్భాలలో మాత్రమే ఈ భద్రతా సదుపాయాన్ని వినియోగించుకోవాలి. రైలు ప్రయాణంలో ఎవరికైనా హఠాత్తుగా తీవ్రమైన అనారోగ్యం కలిగినా లేదా వైద్య సహాయం అవసరమైనా చైన్ లాగవచ్చు. అలాగే రైలు కోచ్ లోపల ఎక్కడైనా మంటలు చెలరేగినా లేదా దట్టమైన పొగ వస్తున్నట్లు గమనించినా వెంటనే రైలును ఆపాలి. రైలు వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు కూడా ప్రయాణికులు అప్రమత్తమై గొలుసును లాగవచ్చు. రైలును తప్పనిసరిగా ఆపవలసిన పరిస్థితి తలెత్తితేనే దీనిని వాడాలి. ఇలాంటి నిజమైన అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అంతే తప్ప చిన్న చిన్న కారణాలకు గొలుసును లాగడం వల్ల వేలాది మంది ఇతర ప్రయాణికుల సమయం వృధా కావడమే కాకుండా రైల్వే వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

అనవసరంగా చైన్ లాగితే..
చాలా సందర్భాలలో సరైన కారణం లేకుండా చైన్ లాగడం వంటి మోసపూరిత పద్ధతులు రైల్వే అధికారుల దృష్టికి వస్తున్నాయి. రైలు ఎక్కడానికి వచ్చిన తమ బంధువులు రైలు దిగలేకపోయారనే చిన్న కారణంతో చాలా మంది ప్రయాణికులు గొలుసు లాగి రైలును ఆపుతున్నారు. అలాగే రైల్వే పోలీసుల తనిఖీలకు భయపడి అక్రమ వ్యాపారులు చైన్ లాగి మధ్యలోనే పారిపోతున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. దక్షిణ రైల్వే ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో 2,632 అక్రమ చైన్ లాగుడు కేసులను గుర్తించి, అందులో ఏకంగా 2,618 మందిని అరెస్టు చేసింది. వీరి నుండి 15,45,165 రూపాయలకు పైగా జరిమానా వసూలు చేసింది. భారతీయ రైల్వే చట్టం 1989 లోని సెక్షన్ 141 ప్రకారం, సరైన కారణం లేకుండా చైన్ లాగడం అనేది చాలా తీవ్రమైన చట్టవిరుద్ధ నేరం. ఇలాంటి నేరానికి పాల్పడినట్లు తేలితే సదరు వ్యక్తికి ఒక సంవత్సరం పాటు కఠిన జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. కొన్ని తీవ్రమైన కేసుల్లో ఈ రెండు శిక్షలను కలిపి విధించే అధికారం కూడా న్యాయస్థానాలకు ఉంది. కాబట్టి ప్రయాణికులు రైల్వే ఆస్తులను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *