బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!
బ్రిటిష్ ప్రభుత్వం తమకు కోట్లాది రూపాయల బాకీ పడిందని.. ఆ అప్పును వడ్డీతో సహా చెల్లించాలని మధ్యప్రదేశ్లోని సీహోర్కు చెందిన వివేక్ రుథియా అంటున్నారు. వ్యాపారి అయిన తన తాత బ్రిటిషర్లకే అప్పు ఇవ్వడం.. అది శతాబ్దం దాటినా ఇంకా చెల్లించకపోవడం సినిమా స్టోరీలా ఉంది కదూ. 1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధ ఖర్చుల కోసం వారికి అత్యవసరంగా నిధులు అవసరమయ్యాయి. ఆ సమయంలో మధ్యప్రదేశ్లోని…