వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు తీరప్రాంతం ప్రస్తుతం విదేశీ పక్షుల కిలకిల రావాలతో కళకళలాడుతోంది. ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్, మానేరు తీరప్రాంతం వలస పక్షుల రాకతో ఒక అద్భుతమైన ప్రకృతి స్వర్గధామంగా మారింది. ప్రతి ఏటా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మంగోలియా, టిబెట్, సైబీరియా, యూరప్ వంటి సుదూర ప్రాంతాల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి అరుదైన పక్షులు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బార్ హెడెడ్ గీస్, పల్లాస్ గల్, పోచార్డ్స్, టీల్స్…