Telangana: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. ఇకపై ఆ పప్పులు ఉడకవ్!
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సీరియస్ రివ్యూ నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు, అదనంగా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేసేలా కఠిన నిబంధనలు రూపొందించాలని సూచించారు….