యానిమేటెడ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నూతన ట్రెండ్ను సృష్టిస్తున్న హోంబలే ఫిల్మ్స్, మహావతార్ నరసింహ గ్రాండ్ సక్సెస్ తర్వాత తమ సినిమాటిక్ యూనివర్స్ నుండి తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించింది. కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ఈ ప్రాజెక్ట్ మహావతార్ పరశురామ్ అని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. పరశురామ జయంతి సందర్భంగా రక్తశక్తమైన గొడ్డలితో ఉన్న మహావతార్ పరశురాముడి మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. మహావతార్ నరసింహతో పోలిస్తే, ఈ కొత్త చిత్రంలో గ్రాఫిక్స్ నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కనిపించనుంది. హాలీవుడ్ స్థాయి 3D విజువల్స్ను ప్లాన్ చేస్తున్నారని, ఇది బాక్సాఫీస్ వద్ద మరో విజువల్ ఫీస్ట్ను అందిస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మహావతార్ నరసింహకు దర్శకత్వం వహించిన అశ్విన్ కుమార్ ఈ మహావతార్ పరశురామ్ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే స్టైల్ ఫాలో అవుతున్న దీపిక, రష్మిక
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు
400 ఏళ్ల చరిత్ర అంతం కాబోతుందా ?? కొండపల్లి కళాకారుల కన్నీటి గాథ !!