జబర్దస్త్ తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలను పంచుకున్నారు. తాను తన సమస్యలను ఎవరితోనూ షేర్ చేసుకోనని, కుటుంబ సభ్యులకు కూడా వాటిని తెలియనివ్వనని స్పష్టం చేశారు. తానే కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, కానీ తన బాధలను మాత్రం వ్యక్తం చేయనని తెలిపారు. ఇటీవల తనకు నడుముకు సంబంధించిన ఒక సర్జరీ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తనను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తాను చాలా ఒంటరిగా భావించానని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన రమ్య గారు ఒక్కరోజు వచ్చి సాయం చేసి, తనను ఇంటి దగ్గర డ్రాప్ చేశారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సైదుల్ రెడ్డి కూడా ఒక చిన్న మనస్పర్థల కారణంగా తనతో లేడని, ఆ సమయంలో తన అనుకున్నవాళ్లు కూడా ఎవరూ పరామర్శించడానికి రాలేదని చెప్పారు.
ప్రస్తుతం జబర్దస్త్లో నూకరాజు, ఇమ్మాన్యుయేల్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని తన్మయ్ తెలిపారు. తాను సమస్యలు పంచుకోకపోయినా, ఆర్థికంగా సాయం కావాలంటే వారు వెంటనే స్పందిస్తారని వివరించారు. తనను “అక్కా అక్కా” అని పిలిచే స్నేహితులు చాలా మంది ఉన్నారని, ఇప్పుడు నూకరాజు టీమ్లో చేస్తూ ఉండటంతో వారిద్దరూ తనకు ఎంతో దగ్గరయ్యారని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం తన ఫాలోవర్లను పెంచుకోవడానికి, పబ్లిక్లో కొనసాగడానికేనని, తన తండ్రి చనిపోయిన తర్వాత రీల్స్ చేయడం తగ్గించానని, ఇప్పుడు మళ్లీ చేస్తున్నానని పేర్కొన్నారు.
తన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ, తాను చాలా ఇంట్రోవర్ట్ అని, కొత్తవారితో మాట్లాడాలంటే భయపడతానని అంగీకరించారు. అయితే, స్టేజ్ పెర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే, డబ్బులు తీసుకుని ప్రేక్షకుల కోసం మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే తపన తప్ప, తనకు కెమెరా ఫియర్ గానీ, స్టేజ్ ఫియర్ గానీ లేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ తనకు తెలియని వయసులోనే అవకాశమిచ్చిందని, ఇది ఒక వ్యసనం లాంటిదని అభిప్రాయపడ్డారు. చిన్నప్పుడు హెలికాప్టర్ చూస్తే పది బజార్లు పరిగెత్తిన తాను, ఇప్పుడు తనను చూడటానికి జనాలు ఎగబడుతుంటే దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అయితే, ఈ లైమ్లైట్ ఎంతకాలం ఉంటుందో తెలియదని, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను గుర్తు చేసుకుంటూ, ఈ గుర్తింపు ఉన్నప్పుడే ఒక ఇల్లు కట్టుకోవాలని ఆకాంక్షించారు. గుంటూరులో ఇల్లు కట్టుకున్నామని, హైదరాబాద్లో కూడా కొనుగోలు చేయాలనే ప్రణాళిక ఉందని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..