Headlines

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ మెప్పిచిందా..?

మూవీ రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం నటీనటులు: సాయికుమార్, సుమన్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, శివ, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి తదితరులు ఎడిటింగ్: సాయిబాబు తలారి సంగీతం: మహావీర్ ఎల్లంధర్ సినిమాటోగ్రఫర్: వెంకట హనుమ లిరిక్స్: చంద్రబోస్ నిర్మాత: మేరుం భాస్కర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట కథ: ధర్మస్థలం నియోజకవర్గంలో ఎలాంటి ఎదురు లేకుండా వరుసగా ఏడుసార్లు గెలుపొందిన అవినీతి నేత…

Read Full News

Telangana: నీ అత్యాశ తగిలెయ్యా.. ఒకేసారి అన్నీ గుడ్లు తినేసిన శ్వేతనాగు.. ఆ తర్వాత జరిగింది వీడియోలో చూడండి..

ఆకలితో ఉన్న ఒక అరుదైన శ్వేతనాగు కోళ్ల గూటిపై దాడి చేసి, ఎదురుగా ఉన్న కోడిని కాటేసి చంపడమే కాకుండా.. ఏకంగా పది గుడ్లను గుటుక్కున మింగేసింది. అయితే ఆ అత్యాశే ఆ పాముకు ప్రాణసంకటంగా మారింది. ఒకేసారి పది గుడ్లను తినడంలో పొట్ట ఉబ్బిపోయి, మొద్దుబారి అసలు కదల్లేని నిస్సహాయ స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. ఈ విచిత్ర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన…

Read Full News

Donkey Milk: గాడిద పాలు విరగవు, పులిసిపోవా..? ప్రచారంలో ఉన్నట్లు ఇవి తాగితే మంచిదేనా..?

పాలు అంటే సాధారణంగా మనకు ఆవు, గేదె, మేక పాలు గుర్తొస్తాయి. కానీ ఇటీవలి కాలంలో గాడిద పాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా గాడిద పాలు తొందరగా విరగవు.. పులవవు.. ఆరోగ్యానికి ఎంతో మంచివ అంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత? గాడిద పాలు నిజంగానే పులవవా? ఇతర పాలతో…

Read Full News

Janmashtami Fast: కృష్ణాష్టమి ఉపవాసం ఎలా విరమించాలి? పూజ తర్వాత ముందు ఏం తినాలో తెలుసా?

Janmashtami Fasting Rules telugu: కృష్ణాష్టమి రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే ఉపవాసం చేయడం ఎంత ముఖ్యమో, దానిని సరైన పద్ధతిలో విరమించడం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కేవలం సాధారణ భోజనం చేయడంతో వ్రతం ముగిసిపోదని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడిపై భక్తితో ఉపవాసం చేసినట్లే, అదే నియమ నిష్ఠలతో వ్రతాన్ని విరమించాలి. సాధారణంగా కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మోత్సవ పూజను నిర్వహిస్తారు. పూజ పూర్తయిన తర్వాత…

Read Full News

విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం తెలిస్తే షాకే..!

మద్యం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయం వెతుక్కోవడం సాధారణమే. కానీ, ఇప్పుడు కొందరు ఏకంగా చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లనే మద్యం మాదిరిగా వినియోగిస్తున్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో ఇథనాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల దుర్వినియోగంపై తనిఖీలు చేపట్టగా.. భారీ స్థాయిలో వాటి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌ సమయంలో సులభంగా లభించేలా ఇచ్చిన లైసెన్స్‌ మినహాయింపే ఇప్పుడు దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తోందన్న అభిప్రాయంతో రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కేంద్రానికి లేఖ రాసింది. మద్యం బదులు…

Read Full News

అడవిలో ఆ ప్రాంతానికి పులి వస్తుంటే.. అన్ని జీవులను అలెర్ట్ చేసే జంతువు ఏదో తెలుసా..?

అడవిలో ప్రతి అడుగుకూ ఓ అర్థం ఉంటుంది. ప్రతి శబ్దం వెనుక ఓ సంకేతం ఉంటుంది. అక్కడ మనుషుల్లా ఫోన్‌లు, వైర్‌లెస్‌ సెట్లు లేకపోయినా.. జంతువులకు మాత్రం తమదైన సమాచార వ్యవస్థ ఉంటుంది. ముఖ్యంగా పులి వంటి ప్రమాదకరమైన మాంసాహారి కదలికలను గుర్తించడంలో కొండముచ్చులు (లంగూర్లు) కీలక పాత్ర పోషిస్తాయి. పులి వేటకు బయలుదేరినప్పుడు.. దాన్ని ముందుగా పసిగట్టే కొండముచ్చులు ప్రత్యేకమైన అలారం కాల్స్‌ చేస్తూ అడవిలోని ఇతర జంతువులను అప్రమత్తం చేస్తాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో…

Read Full News

టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై TG-SAFE ఉక్కుపాదం!

టీనేజర్లను టార్గెట్‌ చేసుకుని అలవాటు చేసే మందులను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ ఫుడ్‌, ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (TG-SAFE), ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారంలోని ఓ మెడికల్‌ షాపులో గురువారం నిర్వహించిన తనిఖీల్లో టాపెంటాడాల్‌ మాత్రల నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజులరామారంలో ఉన్న మనా ఫార్మసీ అండ్‌ జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు పరిసర ప్రాంతాల్లోని టీనేజర్లకు అలవాటు చేసే డ్రగ్‌గా పేరున్న టాపెంటాడాల్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులకు…

Read Full News

Smriti Mandhana: విరాట్, సచిన్‌లకు కూడా సాధ్యం కాని రికార్డు.. రోహిత్ శర్మ రేర్ క్లబ్‌లో చేరిన స్మృతి మంధాన

Smriti Mandhana: మహిళల ఆసియా కప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో కొత్త చరిత్ర సృష్టించింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యంకాని ఓ అరుదైన క్లబ్‌లో స్థానం సంపాదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఆ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచింది. సచిన్, విరాట్ లేని ఆ స్పెషల్ క్లబ్ ఏంటి? అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు అనగానే ప్రతి…

Read Full News

మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..

భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాలు. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాల వరకు ప్రతిదానికీ ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి. అయితే కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత వారి గుర్తింపు కార్డులతో ఏం చేయాలి? వాటిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలా లేక భద్రపరచాలా అనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. అటువంటి కీలక పత్రాల విషయంలో పాటించాల్సిన నియమాలు,…

Read Full News

ఒంటి కాలితో గెంతుతూ రోజూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన చూడండి! వీడియో

బలియా, సెప్టెంబర్‌ 4: చదువుకోవాలన్న సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి రాగిణి నిరూపిస్తోంది. రాగిణికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పలువురి హృదయాలను కదిలిస్తోంది. ఓ కాలు దెబ్బతిన్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ దాదాపు 400 మీటర్ల దూరాన్ని ఒంటికాలిపై గెంతుతూ వెళ్తోంది. రాగిణికి కేవలం ఆరు నెలల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా…

Read Full News