మిక్సీ జార్లో లేదా రోట్లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అందులోనే మగ్గించిన టమోటా గుజ్జు మరియు కొన్ని దోసకాయ ముక్కలు వేసి లైట్గా పల్స్ చేస్తూ గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేయకుండా పలుకుగా ఉంచాలి. ఈ రుబ్బిన పచ్చడిని మిగిలిన పచ్చి దోసకాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.