Headlines

ఆ ఫ్రాంచైజీని వెంటనే వదిలేయ్.. టీమిండియా హీరోపై మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్..!

ఆ ఫ్రాంచైజీని వెంటనే వదిలేయ్.. టీమిండియా హీరోపై మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్..!


Mayank Yadav Comeback: జింబాబ్వేపై సంచలన బౌలింగ్‌తో రీఎంట్రీ ఇచ్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న యంగ్ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్‌కు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి ఒక అనూహ్యమైన ఉచిత సలహా ఇచ్చాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్ (LSG) జట్టును వీడి, సరికొత్త ఫ్రాంచైజీకి మారితేనే అతని కెరీర్‌కు మంచిదని స్పష్టం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

డ్రీమ్ కమ్‌బ్యాక్: గంటకు 156 కిలోమీటర్ల తుఫాన్..!

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మళ్లీ పాత లయను అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు గాయాలతో కూరుకుపోయి, శస్త్రచికిత్సలు, సుదీర్ఘ పునరావాసం (రిహాబ్) తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఈ 24 ఏళ్ల స్పీడ్‌స్టర్.. వచ్చిన తొలి బంతికే వికెట్ తీసి ఐసీసీ సర్క్యూట్‌లో రీఎంట్రీ అదిరిపోయేలా చాటాడు.

కేవలం 18 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి, భారత్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024లో లక్నో తరఫున గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి రికార్డులు సృష్టించిన మయాంక్, ఈ మ్యాచ్‌లోనూ తనదన మార్క్ వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు.

లక్నో వీడితేనే భవిష్యత్తు.. హనుమ విహారి వ్యాఖ్యలు..!

మయాంక్ సాధించిన ఈ విజయంపై స్పందిస్తూనే భారత క్రికెటర్ హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. “మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడాలంటే లక్నో సూపర్‌ జెయింట్స్ నుంచి బయటకు రావాలి. ఎందుకంటే లక్నో జట్టులో ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ షమీ వంటి స్టార్ పేసర్ల కాంబినేషన్ ఎక్కువగా ఉంది. దీనివల్ల మయాంక్‌కు తుది జట్టులో తగినన్ని అవకాశాలు రాక బెంచ్ పైనే పరిమితం కావలసి వస్తోంది. వేరే జట్టుకు మారితే నిలకడగా మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కుతుంది” అని విహారి విశ్లేషించాడు.

అయితే దీని వెనుక ఒక ‘విశ్వసనీయత’ బంధం కూడా ఉందని విహారి అంగీకరించాడు. “మయాంక్ నిరంతరం గాయపడుతున్నా, లక్నో యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచింది. అతని సర్జరీ ఖర్చులు చూసుకోవడంతో పాటు జట్టులోనే ఉంచుకుని ప్రోత్సహించింది. కాబట్టి ఆ ఫ్రాంచైజీకి అతడు ఇచ్చే ప్రాధాన్యతను కూడా మనం కాదనలేం” అని వివరించాడు.

కష్టకాలంలో నిలబడ్డ లక్నో.. రూ. 11 కోట్ల రిటైన్ బంధం..!

2022 ఐపీఎల్ వేలంలో కేవలం రూ. 20 లక్షల ప్రాథమిక ధరకు మయాంక్‌ను లక్నో కొనుగోలు చేసింది. గౌతమ్ గంభీర్, విజయ్ దహియాలు అతనిలోని ప్రతిభను గుర్తించి వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత గాయాల వల్ల రెండేళ్లలో అతి కొద్ది మ్యాచ్‌లే ఆడినప్పటికీ, ఐపీఎల్ 2025 నుంచి ఏకంగా రూ. 11 కోట్ల భారీ ధరకు లక్నో అతడిని రిటైన్ చేసుకుంది. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సుదీర్ఘంగా శ్రమించి పూర్తి ఫిట్‌నెస్ సాధించిన మయాంక్, ఇప్పుడు మరింత పదునైన బౌలింగ్‌తో తిరిగి వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *