Headlines

Tholi Ekadashi: తొలి ఏకాదశి.. నేటి సాయంత్రం ఇక్కడ నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం!

Tholi Ekadashi: తొలి ఏకాదశి.. నేటి సాయంత్రం ఇక్కడ నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం!


Tholi Ekadashi Tulsi Puja Telugu: ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకునే తొలి ఏకాదశి/ దేవశయని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో నాలుగు నెలల చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. చాతుర్మాసం ముగిసిన అనంతరం కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని/దేవోత్థాన ఏకాదశి) నుంచి తిరిగి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. దేవశయని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం, ఉపవాసం పాటించడం ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ రోజున నియమనిష్ఠలతో వ్రతం ఆచరించిన వారికి విష్ణుకటాక్షం లభిస్తుందని, జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా, పరమపద ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది.

దేవశయని ఏకాదశి రోజున తులసి పూజకు ఉన్న విశిష్టత

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది తులసి. అందుకే ఆమెను హరిప్రియ అని కూడా పిలుస్తారు. సనాతన ధర్మంలో తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి నిత్యం పూజిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉండటం శుభానికి, ఐశ్వర్యానికి, సానుకూల శక్తికి సంకేతంగా పరిగణిస్తారు. ఏకాదశి రోజున తులసి మాతకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా దేవశయని ఏకాదశి రోజున తులసి పూజకు మరింత విశిష్టమైన స్థానం ఉంది.

ఈ సాయంత్రం తులసి వద్ద తప్పకుండా దీపం వెలిగించండి

మత విశ్వాసాల ప్రకారం, దేవశయని ఏకాదశి సాయంత్రం తులసి మొక్క వద్ద నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. భక్తులు తమ శక్తి, విశ్వాసాన్ని బట్టి 11, 21 లేదా 51 దీపాలు వెలిగిస్తారు. అలాగే దీపదానం చేయడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. తులసి వద్ద దీపం వెలిగించిన తర్వాత శ్రీమహావిష్ణు మంత్రాలు లేదా ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని జపించడం శ్రేయస్కరంగా చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొని, ఆధ్యాత్మిక శాంతి పెరుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగుతాయని భక్తుల విశ్వాసం.

ఇవి కూడా చదవండి



ఈ రోజున పాటించాల్సినవి

  • శ్రీమహావిష్ణువుకు తులసి దళాలతో పూజ చేయాలి.
  • తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించాలి.
  • విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని జపించాలి.
  • ఉపవాసాన్ని నియమనిష్ఠలతో ఆచరించి, సాత్వికాహారం తీసుకోవాలి.
  • దానం, ధర్మకార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు పురాణాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడినవి. వీటిని విశ్వాస సంబంధిత సమాచారంగా మాత్రమే పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *