తాజాగా, ఈ సంస్థ డైరెక్టర్లు తమ పంథాను మార్చి ‘WAWE’ అనే కొత్త పేరుతో రంగంలోకి దిగారు. నల్గొండ పట్టణంలో రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి, మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పక్కాసమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ సమావేశంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో సంస్థకు చెందిన పదిమంది డైరెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయంటూ చేసే నమ్మకద్రోహపు మాటలను నమ్మి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అపరిచిత సంస్థలు ఇచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి అనుమానాస్పద కార్యక్రమాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
మరిన్ని వీడియోల కోసం :