అమెరికా, ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలకు స్వస్తి పలకడానికి ఇరాన్ ముందుకు వచ్చింది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఇరాన్ 14 పాయింట్లతో కూడిన ప్రతిపాదనలను అమెరికాకు సమర్పించింది. పాకిస్తాన్ దౌత్య మార్గాల ద్వారా పంపిన ఈ ప్రతిపాదనలలో బలగాల ఉపసంహరణ, భద్రతా హామీలు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, ఆంక్షల ఎత్తివేత, హర్మూజ్ జలసంధి దిగ్బంధం తొలగింపు, యుద్ధ నష్టపరిహారం వంటి కీలక డిమాండ్లు ఉన్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, శాశ్వత పరిష్కారం కావాలని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం :
పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్ను నిలబెట్టేదెవరు..?