విశాఖపట్నం ఆర్కే బీచ్లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం.. సముద్రాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విముక్తి చేసేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, మత్స్యకారులు, స్కూబా డైవర్లను అడిగి తెలుసుకున్నారు.