వేసవి కాలం అంటేనే మామిడి పండ్ల సీజన్. తీయని రుచితో పాటు విటమిన్ ఏ, సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే మామిడిని అందరూ ఇష్టంగా తింటారు. అయితే, ఈ తీపి పండు అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం (Diabetes) ఉన్నవారు మామిడి పండ్లను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి.