సనాతన హిందూ ధర్మంలో 108 సంఖ్య విశేష ప్రాధాన్యత సంతరించుకొంది. వేదాల్లో 108 ఉపనిషత్తులు. జపమాలలో ఉన్న పూసలు 108, భగవంతుని నామాలు 108 అంతే కాదు 12 రాశులు × 9 గ్రహాలు = 108.ఇలా ఎ విధంగా చూసిన 108 సంఖ్య అనేక యోగ, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో పవిత్ర సంఖ్యగా భావిస్తారు హైందవులు. ఈ 108 సంఖ్య కు సౌమ్యనాథ స్వామి ఆలయానికి ఉన్న సంబంధం విడదీయరానిది. ఈ ఆలయానికి భక్తులలో ప్రాచుర్యం పొందిన ఒక విశ్వాసం ఉంది. దీని ప్రకారం సౌమ్యనాథ స్వామి ఆలయంలో త్రికరణ శుద్ధిగా 9 ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరతాయని, అనంతరం స్వామి వారికి కృతజ్ఞతగా అదే ఆలయంలో 108 ప్రదక్షిణలు చేయడం భక్తుల ఆనవాయితీగా వస్తుంది.