ఇక ఈ దృష్టి దోషం అనేది గత కొంత కాలం నుంచి వస్తూ ఉంది. పూర్వీకులు కూడా దీని నుంచి బయటపడటానికి కొన్ని కొన్ని నియమాలు అనుసరిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు దృష్టి దోషానికి ఎక్కువగా గురి అవుతారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
సింహ రాశి : సింహ రాశి వారికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వీరికి ప్రతిభ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన సింహ రాశి వారిపై దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు పండితులు. అందువలన వీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంట.
తుల రాశి : తుల రాశి వారు చాలా అందమైన వారు అంతే కాకుండా, వీరు మంచి మాటతీరును కలిగి ఉంటారు. వీరి పనులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. అందువలన ఈ రాశి వారిపై కూడా ఇతరుల చెడు దృష్టి చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి మంచి ప్రతిభ ఉంటుంది. వీరు ఏ పనులు చేపట్టినా అందులో సక్సెస్ అవుతారు. అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంటారు. అంతే కాకుండా చాలా త్వరగా ఉన్నత శిఖరాలను అందుకుంటారు. అందుకే వీరిపై కూడా ఇతర వ్యక్తుల చెడు దృష్టి ఉంటుందని చెబుతున్నారు పండితులు.
మకర రాశి : శని పాలించే మకర రాశి వారి ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అందువలన ఈ రాశి వారిపై కూడా చెడు దృష్టి ఎక్కువగా ఉంటుందంట. వీరి ఆలోచించే విధానం, వీరి కష్టం, వీరు అందరితో ఉండే విధానం వలన వీరు ఎక్కువగా దృష్టి దోషానికి గురి అవుతారంట.




