Headlines

గ్రీస్‌లో విషాదం: ఎయిర్ షోలో యుద్ధ విమానం కుప్పకూలి.. ఇద్దరు పైలట్లు మృతి!


వేలాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న ‘ఏథెన్స్ ఫ్లయింగ్ వీక్ 2026’ వైమానిక ప్రదర్శనలో ఎఫ్-4 ఫాంటమ్ (F-4 Phantom) యుద్ధ విమానం పాల్గొంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అతి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా ఈ జెట్ విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి కిందికి పడిపోవడం ప్రారంభమైంది. విమానం వేగంగా కిందకు దూసుకొచ్చి నేలను ఢీకొట్టి పేలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకున్నారు.  అధికారులు అప్రమత్తమై ఎయిర్ షోను వెంటనే నిలిపివేసి  ప్రేక్షకులను ఆ ప్రాంతం నుంచి తరలించారు.

సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 2:55 గంటల ప్రాంతంలో ఏథెన్స్‌కు ఉత్తరాన తనగ్రా సమీపంలో ఈ విమానం కూలిపోయింది.  ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సిబ్బందిని 40 ఏళ్ల మేజర్ లావోన్నిస్ బ్లీసియాస్, 37 ఏళ్ల కెప్టెన్ డిమిట్రియోస్ పెట్రోలుగా గ్రీకు వైమానిక దళం గుర్తించింది. వీరుద్దరూ గ్రీకు ఎయిర్ ఫోర్స్‌కు చెందినవారు.  వైమానిక ప్రదర్శనలో భాగంగా ఎఫ్-4ఈ ఫాంటమ్ యుద్ధ విమానాన్ని నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు.

ప్రదర్శన మొదలైన కొద్ది నిమిషాలకే, విమానం చాలా తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి నేలపై కూలిపోయింది. ఈ పెద్ద ప్రమాదం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

పారిశ్రామిక ప్రాంతంలో విమానం కూలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.  ప్రమాదంపై విచారణ జరిపేందుకు గ్రీకు వైమానిక దళం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. యుద్ధ విమానం ఒక్కసారిగా అంత వేగంగా ఎత్తు ఎందుకు కోల్పోయింది అనే దానిపై దర్యాప్తు అధికారులు విమాన శకలాలు, అందుబాటులో ఉన్న వీడియో ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *