సామాన్యమైన దేవాలయ నిర్మాణాలకు భిన్నంగా, చుట్టూ భారీ ద్వారాలు, ఎత్తైన అరుగులు, పటిష్టమైన ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయం ఒక చిన్నపాటి కోటను తలపిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. 16వ శతాబ్దపు మొఘలూరు రాజవంశీయుల చారిత్రక వారసత్వం. ఈ అద్భుత కట్టడానికి వందల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం, 16వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొఘలూరు రాజవంశీయులు ఈ మదనగోపాలస్వామిని తమ ఇష్టదైవంగా కొలిచినట్లు తెలుస్తోంది. ఆనాటి రాజుల శిల్పకళా అభిరుచికి, నిర్మాణ కౌశలానికి ఈ ఆలయమే సజీవ సాక్ష్యం.