Headlines

ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు

ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు


పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఇనిమెళ్ల గ్రామంలో అద్భుతం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్వగ్రామమైన ఈ ప్రాంతంలో పురాతన శ్రీ భావనారాయణ స్వామి ఆలయం ఉంది. ఇటీవల ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని బావిలో ఏడు విలువైన పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శిథిలావస్థకు చేరిన ఈ పురాతన ఆలయాన్ని పునర్నిర్మించాలని ఎమ్మెల్యే నిర్ణయించడంతో గత మూడు రోజులుగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. విగ్రహాల తొలగింపు ప్రక్రియలో భాగంగా, ఆలయ ప్రాంగణంలోని ఒక బావిపై ఉన్న భారీ బండరాళ్లను తొలగించి నీటిని తోడుతుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి. వీటితో పాటు మూడు అరుదైన రాగి రేకులు కూడా లభ్యమయ్యాయి. ఒకేసారి ఏడు విగ్రహాలు బావిలో లభించడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్వం విదేశీ దండయాత్రల సమయంలోనో లేదా దొంగల బారి నుండి రక్షించుకోవడానికో నాటి అర్చకులు, పెద్దలు ఈ విగ్రహాలను బావిలో భద్రపరిచి ఉంటారని భావిస్తున్నారు. లభ్యమైన రాగి రేకులపై ఉన్న శాసనాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇవి ఆలయ చరిత్రకు సంబంధించినవా లేక విగ్రహాలకు సంబంధించిన వివరాలా అనేది త్వరలో తేలనుంది. ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాలను పరిశీలించారు. దేవాదాయ, రెవెన్యూ , పురావస్తు శాఖ అధికారులు ఈ విగ్రహాలు ఏ కాలానికి చెందినవో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. పవిత్రమైన పునర్నిర్మాణ పనుల సమయంలో ఇలా పురాతన విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులు దీన్ని ఒక శుభసూచకంగా భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పింక్ సాల్ట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి

భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము.. కన్నుమూసి తెరిచే లోపే ప్రాణాలు తీసేస్తుంది!

ప్రతీ రోజూ నడకతో.. శరీరంలో అద్భుత మార్పులు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *