పశ్చిమ బెంగాల్లో బిజెపి, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నెలకుంటోంది. ఆ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానానికి సంబంధించి రీపోలింగ్ నిర్వహించనుండగా.. మిగిలిన 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. 100 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉండగా.. అధికార టీఎంసీ 91 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా భవానిపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై సువెందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. అటు నందిగ్రామ్లోనూ సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు.
తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.