Watch : యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..

Watch : యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..


యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అద్భుత ఆధ్యాత్మికతకే కాదు, అప్పుడప్పుడు ప్రకృతిలో జరిగే వింతలకు కూడా వేదికవుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రంలో గురువారం ఉదయం కొండపై ఒక అరుదైన, అత్యంత ఆసక్తికరమైన దృశ్యం భక్తుల కంటపడింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నల్లరాతి ఏనుగు విగ్రహంపై ఒక వానరం ఎక్కి కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా జంతువుల మధ్య ఉండే సహజ వైరాన్ని మరిచి, ఒక విగ్రహ రూపంలోని గజరాజుపై వానరరాజు ఎంతో గంభీరంగా, తీరిగ్గా కూర్చొని ఉండటం చూసి భక్తులు ముగ్ధులయ్యారు. ఈ వింత దృశ్యాన్ని చూసిన వారు ‘ ఆ వానరాన్ని ఆంజనేయ స్వామిగా భావించి భక్తితో స్మరించుకున్నారు. కొండపైకి వచ్చే భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు. ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో సైతం పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారుతోంది.

ఆలయ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణంలో ఇలాంటి సంఘటనలు భక్తులకు కనువిందును కలిగించడం ఇదే తొలిసారేం కాదు గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. సాధారణంగా వానరాలు అల్లరి చేస్తూ అటూ ఇటూ పరిగెడుతుంటాయి, కానీ ఈ కోతి మాత్రం ఏనుగు విగ్రహంపై చాలా సేపు ప్రశాంతంగా కూర్చొని ఉండటం క్షేత్ర మహిమేనని భక్తులు చర్చించుకుంటున్నారు. ఈ అరుదైన దృశ్యం యాదాద్రి కొండపై నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గజరాజుపై ఈ వానరం ఏం చేస్తుందో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *