Headlines

Sunrisers Hyderabad : సన్‌రైజర్స్‌ కెప్టెన్ పై బీసీసీఐ వేటు.. కావ్య మారన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయా?

Sunrisers Hyderabad : సన్‌రైజర్స్‌ కెప్టెన్ పై బీసీసీఐ వేటు.. కావ్య మారన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయా?


Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై విమర్శలు వస్తుండగానే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్ ఈ శిక్షకు గురయ్యారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినందుకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతో సరిపెట్టారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక కెప్టెన్ పదే పదే ఈ తప్పిదాన్ని పునరావృతం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. జరిమానా మొత్తం రూ.25 లక్షలు దాటితే కెప్టెన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇస్తారు. అయితే 2025 సీజన్ నుంచి వచ్చిన మార్పుల ప్రకారం.. ఓవర్ రేట్ తప్పిదాల వల్ల నేరుగా నిషేధం విధించరు. ఒకవేళ ఒక సీజన్‌లో 5 డీమెరిట్ పాయింట్లు వస్తేనే సదరు కెప్టెన్ లేదా ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కమిన్స్ కేవలం ఒకసారే ఈ తప్పిదం చేశారు కాబట్టి ఆయన ఆడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.

పాయింట్ల పట్టికలో హైదరాబాద్ పరిస్థితి

కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో ఓడిపోవడం జట్టు నెట్ రన్ రేట్‌పై ప్రభావం చూపింది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న సన్‌రైజర్స్‌కు ఇప్పుడు కెప్టెన్‌పై జరిమానా పడటం మానసికంగా కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఇదే సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే రెండుసార్లు జరిమానా కట్టి రూ.36 లక్షలు చెల్లించడం గమనార్హం.

రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకున్న ప్యాట్ కమిన్స్, తదుపరి మ్యాచ్‌లలో జట్టును సమయానికి ఓవర్లు వేయించేలా నడిపించాల్సి ఉంటుంది. రాబోయే మ్యాచ్‌లలో మళ్ళీ ఈ పొరపాటు జరిగితే జరిమానా పెరగడమే కాకుండా డీమెరిట్ పాయింట్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఓటమితో డీలా పడ్డ కావ్య మారన్ సేన, ఈ నిబంధనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *