నెలకు రూ.15 వేల వరకు జరిగే ఆటోమేటిక్ చెల్లింపులకు ఎలాంటి ఓటీపీ, పాస్ వర్డ్ అవసరం లేదని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఇంతకంటే ఎక్కువ పేమెంట్స్కు మాత్రమే ఓటీపీ లేదా పాస్ వర్డ్ ధృవీకరణ అవసరమవుతుందని స్పష్టం చేసింది. ఇక ఓటీసీ సబ్స్క్రిప్షన్లు, కరెంట్ బిల్లుల చెల్లింపుల కోసం ఇ-మాండేట్ ఎంచుకున్న వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేదా రుసుములు వసూలు చేయవద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.