రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం రూపంలో కొంతమొత్తం ప్రతీ ఏడాది అందిస్తూ వస్తోంది. ఎప్పటినుంచో ఈ పథకం అమలవుతుండగా.. దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకంగా ఇది కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది లబ్ది పొందుతున్నారు.