తన చందాదారుకలు ఈపీఎఫ్లో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ‘ఈపీఎఫ్ఓ 3.0’ పేరుతో ఈ అప్గ్రేడ్ ప్రక్రియను వేగవంతం చేసింది. మే నెల చివరి నాటికి ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం చందాదారులకు ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.