Andhra Pradesh: గ్రహణానికే సవాల్.. అన్నీ గుళ్లు మూసినా తెరిచే ఉండే ఈ ఆలయం గురించి తెలుసా..?
సాధారణంగా గ్రహణం వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ మూతపడతాయి. గ్రహణ సమయానికి కనీసం 6 గంటల ముందే ద్వారాలు మూసివేసి, గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ చేసి మళ్ళీ తెరుస్తారు. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా, గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా విరాజిల్లుతోంది చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. చంద్ర గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడినా, శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం భక్తుల కోసం యథావిధిగా తెరిచే ఉంటుంది. రాహు-కేతు క్షేత్రంగా…