Headlines

వృద్ధుడి ఇంట్లో రూ.6.72 లక్షల బంగారం మాయం.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజం!

స్మార్ట్‌ఫోన్‌ అంటే క్రేజ్‌ ఉండటం సహజమే. కానీ ఆ క్రేజ్‌ హద్దులు దాటితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మహారాష్ట్రలోని యవత్మల్‌లో వెలుగుచూసిన ఘటన చెబుతోంది. iPhone Pro కొనాలన్న కోరికతో ఓ మైనర్ బాలుడు ఏకంగా తన సొంత తాత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోని ఇనుప అల్మరాను పగలగొట్టి సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.6.72 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన…

Read Full News

ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు..

ఉదయాన్నే వేడివేడిగా, దూదిలాంటి ఇడ్లీలు తింటుంటే ఆ మజాయే వేరు. పైగా నూనె లేకుండా ఆవిరితో చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. అయితే ఇంట్లో ఎంత శ్రద్ధగా పిండి రుబ్బినా.. కుక్కర్ మూత తీశాక కింద ప్లేట్‌లోని ఇడ్లీలు నీళ్లగా మారిపోవడం, పిండి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దగా రావడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. పిండి బాగున్నా ఇడ్లీలు పాడవడానికి అసలు కారణం ఇడ్లీ స్టాండ్‌ను సరిగ్గా అమర్చకపోవడమేనని వంట నిపుణులు చెబుతున్నారు….

Read Full News

వచ్చేస్తున్నాయ్.. ఫైవ్ స్టార్ హోటల్‌ను మించి.. 260 వందే భారత్ స్లీపర్ రైళ్లతో లగ్జరీ నైట్ జర్నీ..

ఇప్పటికే గౌహతి-హౌరా మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ సర్వీసులు పట్టాలెక్కగా.. మరికొన్ని రైళ్లు ప్రస్తుతం ట్రయల్ రన్ పూర్తి చేసుకుంటున్నాయి. వీటిని త్వరలోనే బెంగళూరు-ముంబై వంటి కీలక మార్గాల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రూట్లలో రాత్రి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ భారీ స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ స్లీపర్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు భారతీయ రైల్వే ఏకంగా 260 రైళ్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా…

Read Full News

Andhra News: అదినా 20 ఏళ్ల కష్టం.. కాస్త కరుణించండి సారు.. అన్నదాత వినూత్న నిరసన!

ఏలూరు జిల్లా సెప్టెంబర్ 08 : ఏళ్ల తరబడి కాయా కష్టం చేసి తాను దాచుకున్న డబ్బును తిరిగివ్వడం లేదని ఓ రైతు వినూత్న నిరసనగా దిగాడు.. నేరుగా వ్యవసాయ సహకార సంఘం ఆఫీస్‌లోనే మంచం వేసుకొని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన చిట్టూరి నర్సింహమూర్తి స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు రూ. 19 లక్షలు డిపాజిట్ చేశారు. వృద్ధాప్యంలో తమ అవసరాలకు అక్కరకు వస్తాయన్న ఆశతో…

Read Full News

వీపు గోకుతూ నెలకు రూ.14 లక్షల సంపాదన! చిన్ననాటి జ్ఞాపకమే పెద్ద వ్యాపారం..

చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన 32 ఏళ్ల ఝాంగ్ షియావోకియావో తన వినూత్న వ్యాపార ఐడియాతో ఆశ్చర్యపరుస్తున్నాడు. శరీర దురదను గోకే వినూత్న సేవలను (ఇచ్-స్క్రాచింగ్) ఒక ప్రాఫిటబుల్ బిజినెస్‌గా మలచి, ప్రస్తుతం రెండు అవుట్‌లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షల (1,00,000 యువాన్లు) వరకు ఆర్జిస్తున్నాడు. ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం, చేతులు అందక ఇబ్బంది పడే వీపు భాగాలపై దురద తీర్చుకోవడానికి ఈ సేవలు ఒక మంచి ఉపశమనంగా మారుతుండటంతో దీనికి ఊహించని స్థాయిలో ఆదరణ…

Read Full News

చాలా తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా? అయితే ఈ ఒక్క లడ్డూ తినాల్సిందే!

ఈ మధ్యకాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే దాని నుంచి బయటపడాలని చాలా మంది డైట్ పాటించడం, రక్తం ఎక్కువగా ఉండే ఎరుపు రంగు ఆహారాలు తినడం చేస్తుంటారు. కానీ ఎరుపు రంగు పండ్లు కూరగాయలు మాత్రమే కాదు, ఈ ఒక్క లడ్డూ ప్రతి రోజూ తిన్నా చాలు రక్తహీనత దూరం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసకుందాం. రక్తహీనత శరీరంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్‌ను తగ్గిస్తుంది….

Read Full News

Jabardasth : నువ్వా .. మా పక్కన కూర్చోకు.. చాలా అవమానించారు.. జబర్దస్త్ నటుడి ఆవేదన..

ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ శాంతి స్వరూప్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన అవమానాలను, బాధాకరమైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రధానంగా లేడీ గెటప్‌ల కారణంగా సాటి కళాకారుల నుంచే తాను ఎలా కించపరచబడ్డాడో ఆయన వివరించారు. ఈ సంభాషణ టెలివిజన్ పరిశ్రమలో కళాకారులు ఎదుర్కొనే అంతర్గత సవాళ్లను వెలుగులోకి తెచ్చింది. శాంతి స్వరూప్ మాటల్లో, “ఏయ్, మీరు లేడీ గెటప్ పక్కన కూర్చోకండి,” “మాతో ఫోటోలు దిక్కండి” వంటి మాటలు తనను ఎంతగానో బాధించాయని తెలిపారు….

Read Full News

Spinach : సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌ ఇది.. ఆరోగ్యానికి నిధి

పాలకూర శరీరానికి ఎంతో మేలు చేసే అత్యంత పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు A, C, K పుష్కలంగా ఉంటాయి. పాలకూర నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే పాలకూర బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. మరిన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం.. పాలకూరలో ఐరన్ శాతంతో పాటు విటమిన్ C…

Read Full News

వేడి నీళ్ల కోసం గీజర్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం!

చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో వాటర్ హీటర్లు, గీజర్ల వాడకం సర్వసాధారణమైపోతుంది. ఉదయాన్నే వేడి నీటి స్నానం హాయినిచ్చినప్పటికీ, గీజర్ల వాడకంలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో గీజర్లు పేలిపోవడం, బాత్‌రూమ్‌లలో విద్యుత్ షాక్ కొట్టడం, గ్యాస్ గీజర్ల లీకేజీ వల్ల ఊపిరాడక ఊపిరి వదిలిన సంఘటనలు తరచుగా వింటున్నాం. అందుకే గీజర్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన భద్రతా జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటో కట్-ఆఫ్ స్విచ్…

Read Full News

Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రముఖ నటి నివేదితా సతీశ్‌ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఫొటోగ్రఫర్‌, వ్యాపారవేత్త సుహైబ్‌ మహమ్మద్‌తో నివేదిత నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని…

Read Full News