అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..
కడప జిల్లా రాజంపేటలో అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. స్థానిక దీప్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెను కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో లాడ్జిలోని 22 గదుల్లో సుమారు 33 మంది ప్రయాణికులు నిద్రిస్తుండటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అర్థరాత్రి సమయంలో లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు లాడ్జిలోని 22 గదులకు ఈ మంటలు అంటుకుని దట్టమైన పొగ కమ్మేసింది. అప్రమత్తమైన లాడ్జి సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక…