బంగారం కొనాలనుకుంటున్నారా..? మళ్లీ భారీ షాక్ తగిలింది. ధరలు మరోసారి పెరిగాయి. ఈ వారంలో సోమవారం నుంచి ధరలు పెరగ్గా.. గురువారం, శుక్రవారం తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. కానీ శనివారం సీన్ రివర్స్ అయింది. గోల్డ్ రేట్లు ఇవాళ భారీగా పెరిగి షాకిచ్చాయి. దీంతో రెండు రోజుల తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. జులై 25న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,930 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.600 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,32,850 వద్ద ట్రేడవుతోడగా.. ఇవాళ రూ.550 మేర పెరుగుదల నమోదు చేసింది. అటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,930 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,850గా ఉంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,45,080 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,33,000గా ట్రేడవుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.1,33,00గా ఉండగా.. శనివారం ఒక్కరోజే రూ.700 పెరిగింది. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్లో కేజీ సిల్వర్ రూ.2.40 లక్షల దగ్గర కొనసాగుతోంది. అటు బెంగళూరులో నిన్న రూ.2.35 లక్షల వద్ద ఉండగా.. నేడు రూ.2.40 లక్షలకు చేరుకుంది.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం కొనసాగుతుండటం బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తోంది. ఇక అమెరికా డాలర్, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు పసిడి ధరలు ఒడిదొడులకు లోనయ్యేలా చేస్తున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు.




