Headlines

Dhurandhar: ‘ధురంధర్’ సినిమాలో అసలు స్టోరీ ఎక్కడుంది? 3వేల కోట్ల బ్లాక్ బస్టర్ పై స్టార్ డైరెక్టర్ విమర్శలు


బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 3,000 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించాయి. అయితే, ఈ సినిమా విజయం, దాని కథాంశంపై ప్రముఖ దర్శకుడు టిగ్మాన్షు ధూలియా సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘ధురందర్‌లో అసలు కథే లేదు’ అని అక్కసు వెళ్లగక్కారు. ‘కరెంట్ స్టేట్ ఆఫ్ మీడియా అండ్ ఫిల్మ్’ కార్యక్రమానికి హాజరైన టిగ్మాన్షు ధూలియా బాలీవుడ్‌లో కథ చెప్పే శైలి కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన దీనికి ఉదాహరణగా ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలను పేర్కొన్నారు. ‘మిమ్మల్ని ఎవరైనా ‘ధురందర్’ సినిమా కథ ఏమిటని అడిగితే, మీరు ఏమీ చెప్పలేరు. ఒక హీరో పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ బీభత్సం సృష్టిస్తాడు. ఇది అసలు కథేనా? సినిమాల్లో కథలే లేనట్టుగా ఉంది. కథలు చెప్పే దర్శకులు కనుమరుగవుతున్నారు, నిజమైన కథలు చెప్పాలనుకునే వారికి అవకాశం దక్కడం లేదు. అందరూ ఒకే రకమైన సినిమాలను అనుకరిస్తున్నారు’ అని టిగ్మాన్షు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా సినిమా ఇండస్ట్రీలో కథలు కొరవడటానికి పెట్టుబడిదారీ విధానమే కారణమని ఆయన అన్నారు. ‘అతిగా పెట్టుబడిదారీ విధానం ఉన్న వ్యవస్థలో, ప్రతిదీ ఒకేలా కనిపించడం మొదలవుతుంది. నేటి ఫ్యాషన్‌ను చూడండి, అందరి హెయిర్‌స్టైల్ ఒకేలా ఉంది. నగరాలు కూడా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఒకేలా కనిపిస్తున్నాయి. నా స్వస్థలం అలహాబాద్ దాని ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అది ఇతర నగరాలలాగే మాల్స్, కార్లతో నిండిపోయింది. ఇటువంటి వ్యవస్థ వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను నాశనం చేస్తుంది,” అని ఆయన అన్నారు.

కాగా ధురంధర్, ధురంధర్ ది రివేంజ్ సినిమాలకు సంబంధించి టిగ్మాన్షు ధూలియా చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోది. ఒక ట్విట్టర్ యూజర్, “మరో అసూయపరుడైన దర్శకుడు పుట్టుకొచ్చాడు” అని వ్యాఖ్యానించగా, మరొకరు, “ఇది అసూయకు పరాకాష్ట” అని విమర్శించారు. మరి ఈ విమర్శలకు టిగ్మాన్షు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *