విజ్ఞాన గనిగా, పరిశోధనా కేంద్రంగా: సాధారణంగా బౌద్ధ విహారాలు కేవలం ప్రార్థనలకే పరిమితం కావు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండ్రాజవరం విహారం కూడా విద్యార్థులు, యువత, పరిశోధకులకు బౌద్ధ తత్వశాస్త్రంపై అవగాహన పెంచే ఒక విజ్ఞాన కేంద్రంగా మారనుంది. బుద్ధుని ప్రధాన సూత్రాలైన అహింస, కరుణ, సమానత్వం, శాంతి వంటి సద్గుణాలను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేసే శోధనా ప్రాంగణంగా ఇది పనిచేస్తుంది. బుద్ధ పౌర్ణిమ వంటి పర్వదినాల్లో ప్రత్యేక విపస్సన ధ్యాన తరగతులు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక చర్చలు ఇక్కడ నిరంతరం నిర్వహించనున్నారు.