అయితే బెంగాల్లో రెండో దశ పోలింగ్లో దాదాపు తుది దశకు చేరుకుంది. తొలి దశలో మాదిరి ఇప్పుడు కూడా బెంగాల్లో బంపర్ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి. 90 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని ఈసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 79 శాతం పోలింగ్ నమోదయ్యింది.
అయితే ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ గుర్తుపై టేప్ అతికించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ టేప్ ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని , అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
అయితే ఈ పోలింగ్లో రాజకీయా నేతలు, సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా తాను పోటీ చేస్తున్న భవానీపూర్లో ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం బలగాలు ఎన్ని కుట్రలు చేసినా టీఎంసీదే గెలుపన్నారు. పోలింగ్ బూత్ దగ్గర విక్టరీ సంకేతాన్ని చూపించారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.