ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ఇందులో తెలిపింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే విశాఖలో జోన్ కార్యాలయం, ఇతర భవన సముదాయాల పనులు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు. అలాగే ఇతర జోన్ల పరిధిలోని అధికారులను ఇక్కడికి బదిలీ చేయనున్నారు.