భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.